సాంబ సెక్టారుకు చేరుకున్న హోం మంత్రి షిండే
శ్రీనగర్ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ వరుసగా కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఇవాళ భారత సరిహద్దులోని పలు సెక్టార్ను పరిశీలించనున్నారు. కొద్దిసేపటి క్రితం షిండే సాంబ సెక్టార్కు చేరుకున్నారు. ఇక్కడ బీఎస్ఎఫ్ జవాన్లను కలిసిన అనంతరం నియంత్రణ రేఖ వద్ద ముష్కరుల దాడిలో దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించనున్నారు.సోమవారం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కాల్పులు జరిగే ప్రదేశాల్లో పర్యటించిన సంగతి విదితమే.