జైత్రయాత్రకు దిగ్విజయ్ను ఆహ్వానించా :మంత్రి డీకే అరుణ
న్యూఢిల్లీ : ఈ నెల 29న గద్వాలలో నిర్వహించబోయే కాంగ్రెస్ జైత్రయాత్ర సభకు దిగ్విజయ్సింగ్ను ఆహ్వానించామని మంత్రి డీకే అరుణ తెలిపారు. దిగ్విజయ్సింగ్తో డీకే అరుణ సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ జైత్రయాత్ర సభలు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పారు. మొన్న భోదన్లో జరిగిన సభ విజయవంతమైందని గుర్తు చేశారు.పాలమూరు జిల్లా ఎంపీ స్థానం నుంచి రాహుల్ను పోటీ చేయించాలనే ప్రతిపాదన దిగ్విజయ్ ముందుంచుతామని ఆమె తెలిపారు.