మోడీ సభాస్థలికి సమీపంలో పేలిన బాంబు ఉలిక్కి పడ్డ ప్రజలు

బీహార్‌ : పాట్నాలో మోడీ హుంకార్‌ సభాస్థలికి సమీపంలో బాంబు పేలుడు జరిగిన సంఘటన చోటుచేసుకుంది. మరికొన్ని పేలుళ్లు జరగొచ్చని పాట్నా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్తత పరిస్థితుల మధ్యనే నరేంద్రమోడి సభా వేదికపైకి చేరుకున్నారు. పేలుళ్ల ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఎన్‌ఐఏ బృందం రంగంలోకి దిగింది.