పేలుళ్లతో దద్దరిళ్లిన పాట్నా : ఒకరి మృతి
బీహార్ : బీహార్ రాజధాని పాట్నా వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. రెండు గంటల వ్యవధిలో ఏడు చోట్ల నాటుబాంబులు పేలడంతో ఒకు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పాట్నా రైల్వేస్టేషన్లోని 10వ నంబర్ ప్లాట్ ఫాం వద్ద మొదటగా నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒరు మృతి చెందగా ,ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పేలని మరో రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత గాంధీమైదాన్ సమీపంలోని సినిమా ధియేటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది. అనంతరం భాజపా ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి సభ జరిగే గాంధీ మైదాన్ ప్రాంగణంలో రెండు చోట్ల ,గాంధీ మైదాన్ వెలుపల నాలుగుచోట్ల పేలుళ్లు జరిగాయి.