సంస్థానాలను విలీనం చేయించిన ఘనత పటేల్దే : అద్వానీ
గుజరాత్ : సంస్థానాలను దేశంలో విలీనం చేయించిన ఘనత సర్దార్ వల్లభాయ్పటేల్దేనని భాజపా అగ్రనేత ఎల్ .కె.అద్వాని కొనియాడారు. గుజరాత్లో జరిగిన సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి అద్వానీ హాజరై ప్రసంగించారు. ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లే ముందు సంస్థానాలను వారి ఇష్టానికి వదిలి వెళ్లారని సంస్థానాలను పటేల్ విలీనం చేయించారన్నారు. సర్దార్ వల్లబాయ్ పటేల్ లేకపోతే జువాగఢ్ ,హైదరాబాద్ సంస్థానాలు ఏమయ్యోయో అని ఆందోళన వ్యక్తం చేశారు. నిజాం పాలనలో మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. పాకిస్థాన్లో చేరితే ఏం ఇస్తారని జోధ్పూర్ మహారాజ్ జిన్నాతో చర్చలు జరిపారని జిన్నా ఖాళీకాగితంపై సంతకం చేసి షరతులు రాసుకోమన్నారని అద్వానీ వివరించారు.