తిరస్కరణ ఓటు గుర్తు సిద్దం
న్యూఢిల్లీ : ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తిరస్కరణ ఓటు ప్రవేశపెట్టబోతున్న భారత ఎన్నికల కమిషన్ అందుకు సంబంధించిన గుర్తును సిద్దం చేసింది. ఓటింగ్ మిషన్ (ఈవీఎం) లో దీర్ఘచతురస్రాకారంలో ఉండే బాక్స్లో ‘నోటా’ అని రాసి ఉన్న గుర్తును చేర్చనున్నారు. ఈ గుర్తును ఆమోదించిన కేంద్ర ఎన్నికల సంఘం ,దానిని అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు పంపింది.