పంజాబ్‌లో మోడీ ర్యాలీకి ముప్పు : ఐబీ

న్యూఢిల్లీ : పంజాబ్‌లో బీజేపీ ప్రచార రథసారధి నరేంద్రమోడీ నిర్వహించనున్న ర్యాలీకి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పోలీసులను అప్రపత్తం చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.