పండుగకు పిలిచి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కామాంధులు
ముంబయి : ముంబయి శివార్లలోని గోరెగావ్లో నలుగురు యువకులు తమకు తెలిసిన ఒక మైనర్ బాలికను దీపావళి వేడుకల పేరుతో ఆహ్వానించి అత్యాచారం చేశారు.పరిచితులైన వారు కావడంతో వారిని నమ్మి వెంట వెళ్లిన పదహారేళ్ల బాలికకు యువకులు శీతలపానియంలో మత్తుమందు కలిపి ఇచ్చారు. ఆమె సృహకోల్పోగానే నలుగురూ ఆమెపై అత్యాచారం జరిపారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులంతా పరారీలో ఉన్నారని వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.