భారత్‌కు రానున్న సీమాంధ్ర బడులు

ముంబయి : బ్రిటన్‌లోని ప్రముఖ పాఠశాలలు మన దేశానికి రానున్నాయి,.. భారతీయ ఉన్నత పాఠశాలలు విద్యార్థులను చేర్చుకునేందుకు ఇవి సిద్దమవుతున్నాయి. ఉపకారవేతనాలు ఇస్తామనడమే కాకుండా అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు హామి ఇస్తున్నాయి. సెయింట్‌ బీన్‌ , సెయింట్‌ క్రిస్టోపర్స్‌ వంటి బ్రిటన్‌కు చెందిన 12 బోర్డింగ్‌ స్కూళ్లు సమాఖ్యగా ఏర్పడి మన దేశంలోని 11 నుంచి 16 ఏళ్ల వయసున్న విద్యార్థులను చేర్చుకునేందుకు ముందుకొచ్చాయి,..