మొయిలీతో ముగిసిన కేంద్ర మంత్రుల భేటీ

న్యూఢిల్లీ : పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల అభ్యంతరాలపై మొయిలీతో చర్చించామని తెలిపారు. తెలుగు ప్రజలందరికి న్యాయం చేయాలని కోరామని పేర్కొన్నారు. రాజధాని, నీళ్లు, నిధులపై చర్చించామని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ అందరికీ చెందినదని చెప్పారు. సమావేశంలో ఎలాంటి ప్యాకేజీగురించి మాట్లాడేది లేదని పేర్కొన్నారు. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామని జేడీశీలం పిలుపునిచ్చారు. సీమాంధ్ర మంత్రులంతా ఒకే అభిప్రాయంతో ఉన్నామని తెలిపారు.