కాంగ్రెస్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధాని శ్రీలంక పర్యటన అంశంతో పాటు రాష్ట్ర విభజన అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశానికి సోనియా, అహ్మద్‌పటేల్‌ .షిండే దిగ్విజయ్‌ హాజరయ్యారు. కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ భేటీ కంటే ముందే కోర్‌ కమిటీ సమావేశం జరుగుతుండడంతో ఈ భేటీకి ప్రాదాన్యత సంతరించుకుంది.