సీఎంను మార్చే ఉద్ధేశం లేదు :దిగ్విజయ్ సింగ్
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రిని మార్చే ఉద్దేశం లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్ స్పష్టం చేశారు. సీఎంను సమన్వయ కమిటీ ఎజెండా కాదని, అందరితో సమన్వయం సాధించడమే సమన్వయ కమిటీ అజెండా అని ఆయన తెలిపారు. సీఎం కిరణ్ సహా వారి కుటుంబ సభ్యులంతా కాంగ్రెస& విధేయులే అని చెప్పారు. సీఎంకు ఏమైనా మాట్లాడే హక్కు ఉంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. సీడబ్యూసీ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆయన కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.