పోలీసులపై మావోయిస్టుల కాల్పులు
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో తొలివిడత పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. దంతేవాడ జిల్లా కిత్రిరాస్ పోలింగ్ కేంద్రం వద్ద మవోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. దంతేవాడ జిల్లా ధనికార్కాలో రెండు టిఫిన్ బాక్స్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. భద్రతా దళాలు లక్ష్యంగా మావోయిస్టులు టిఫిన్బాక్స్ బాంబులు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.