ముజఫర్‌నగర్‌ జిల్లాలో యువతిపై అత్యాచారం

ముజఫర్‌నగర్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా జోలి గ్రామంలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఎస్సీ కుటుంబానికి చెందిన యువతి నీళ్లకోసం కుళాయి వద్దకు వెళ్తుండగా ఓ యువకుడు అపహరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వైద్యపరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.