నార్త్బ్లాక్ వద్ద తెలంగాణ ఎన్జీవోల ధర్నా
న్యూఢిల్లీ : పార్లమెంట్లోని నార్త్బ్లాక్లో జీవోఎం సభ్యులు ఆయా శాఖల అధికారులతో కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో నార్త్బ్లాక్ వద్ద తెలంగాణ ఎన్జీవోలు ధర్నాకు దిగారు. భద్రాచలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని నినదిస్తూ నార్త్బ్లాక్లోకి చొచ్చుకెళ్లేందుకు టీ ఎన్జీవోలు యత్నించారు. హైదరాబాద్పై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని డిమాండ్ చేశారు. ఆంటోనీ కమిటీ సిఫారసులు అంగీకరించలేమని స్పష్టం చేశారు.