‘రాజీనామాల అంశం ప్రస్తావనకు రాలేదు’

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో జరిగిన భేటీలో తమ రాజీనామాల అంశం ప్రస్తావనకు రాలేదని కేంద్ర మంత్రి పురందేశ్వరి తెలిపారు. ప్రధానితో సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో ప్రధానకి నివేదించామని తెలిపారు. ప్రజల ఆకాంక్ష, హైదరాబాద్‌, విద్య, ఉద్యోగ అవకాశాల గురించి ప్రధానికి వివరించామని చెప్పారు. అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని చూపుతామని ప్రధాని చెప్పారని ఆమె తెలిపారు. ప్రధానిని కలిశాక అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని పేర్కొన్నారు. ప్రధానితో భేటీ అయిన వారిలో చిరంజీవి.జేడీ శీలం, కోట్ల చిరంజీవి ఉన్నారు.