హస్తిన చేరుకున్న ఆయా పార్టీల నేతలు

న్యూఢిల్లీ : విభజనపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నేతలు హస్తిన చేరుకున్నారు. ఇవాళ ఐదు రాజకీయ పార్టీలతో మ్తంతుల బృందం చర్చలు జరుపనుంది. ఒక్కొక్క పార్టీకి 20 నిమిషాల సమయం కేటాయించారు. ఉదయం 11 గంటలకు ఎంఐఎంతో ,ఉదయం 11.30 గంటలకు బీజేపీతో, మధ్యాహ్నం 12గంటలకు సీపీఐ, సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్‌ ,సాయంత్రం 5.30 గంటలకు టీఆర్‌ఎస్‌తో మంత్రుల బృందం సమావేశం కానుంది. రేపు మిగతా పార్టీల నేతలతో చర్చలు జరుపనుంది.