కర్నాటకలో ఘోర బస్సు ప్రమాదం :ఏడుగురు సజీవ దహనం

బెంగళూర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పాలెం బస్సు దుర్ఘటన మరువక ముందే కార్నటకలో ఘోరబస్సు ప్రమాదం జరిగింది. బెంగళూర్‌ నుంచి ముంబై వెళుతున్న నేషనల్‌ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు హవేరి జిల్లాలోనికనుమళ్లహల్లీ వద్ద డివైడర్‌ను ఢికొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి.నేషనల్‌ హైవే నాలుగు పైజరిగిన ఈ బస్సు ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం కాగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోమొత్తం50మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.