మిత్రులు అండగా నిలిచారు.సచిన్
ముంబాయి : ఎన్నో విషయాల్లో మిత్రులు అండగా నిలిచారని సచిన్ అన్నారు. వాంఖడే స్టేడియంలో సచిన్ మాట్లాడుతూ.. కుంబ్లే గంగూలీ, అక్ష్మణ్, ద్రవిడ్ తన క్రికెట్ కుటుంబని వ్యాఖ్యానించారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడంలో ఎంతో తృప్తి చెందానని సచిన్ అన్నారు. చిన్నప్పుడు ముంబయిలోని అనేక మైదానాల్లో ప్రాక్టీస్ చేశారని, క్రికెట్ ఎప్పుడూ నా హృదయంలోనే మిగిలి ఉంటుందని అన్నారు.శారీరక దృఢత్వానికి కారకులైన శిక్షకులందరికీ ఈ సందర్భంగా సచిన్ కృతజ్ఞతలు తెలిపారు.