వేయి స్తంభాల ఆలయంలో పోటెత్తిన భక్తులు

వరంగల్‌ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హన్మకొండ చారిత్రక వేయి స్తంభాల ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల్లో దీపాల వత్తులు వెలిగించి భక్తిని చాటకున్నారు. రామప్ప ఆలయంలో పాటు కొమరవెల్లి ,ఐనవోలు, పాలకుర్తి శివక్షేత్రాలలో పాల్గొని ప్రమిధులతో దీపాలను వెలిగించి ఆలయ ప్రాంగణంలో వెలుగులు నింపారు. ఒకవైపు రుద్రాభిషేకాలతో మరోవైపు సామూహిక సత్యనారాయణ వ్రతాలతో ఆలయం కోలాహాలంగా కనిపించింది.