ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌ ప్రారంభం

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 72 అసెంబ్లీ స్థానాలకు పోలీంగ్‌ జరుగుతోంది. 18,015 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.