నేడు మహిళా బ్యాంక్‌ ప్రారంభం

న్యూఢిల్లీ : మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మహిళా బ్యాంక్‌ దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జన్మదినోత్సవం సందర్బంగా మంగళవారం ముంబైలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌తో పాటు యూపీఏ చైర్మన్‌ సోనియా గాంధీ, కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం పాల్గొంటున్నారు. కోల్‌కతా, చైన్నై ,ఆహ్మదాబాద్‌, గౌహతిలో ఏర్పాటు చేసిన ఈ శాఖలద్వారా ఈ బ్యాంకింగ్‌ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.