తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్ :దిగ్విజయ్
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన వద్దన్న సీఎం కిరణ్కుమార్రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పందించారు. తెలంగాణపై సీడబ్య్లూసీ నిర్ణయమే ఫైనల్ అని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఎవరైనా సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన లేల్చిచెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే నక్సల్స్ పెరుగుతారని ,నీటి విద్యుత్ ,ఉద్యోగ సమస్యలు వస్తాయని సీఎం కిరణ్ హస్తినలో మాట్లాడిన విషయం విదితమే.