ఇందిరాగాంధీ జయంతీ వేడుకల్లో ప్రధాని తడబాటు

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా ఆమె సమాధిని సందర్శించే సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తడబడ్డారు. ఇందిర సమాధి వైౖపు వైపు కాకుండా వెనక్కి తిరిగి దండం పెట్టారు. ఆ తర్వాత నాలిక్కరుచుకుని తిరిగి సమాధివైపు తిరిగి నమస్కారం చేశారు. ఈ దృశ్యం కెమెరాలో చిక్కింది. కాగా ఇందిరా గాంధీ 96వ జయంతి సందర్బంగా ఢిల్లీలోని ఆమె సమాధి శక్తిస్థల్‌ వద్ద నేతలు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ , ఉపరాష్ట్రపతి హమిద్‌ అన్సారీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తదితరులు నివాళులర్పించారు.జయంతి సందర్బంగా సాంస్కౄతిక కార్యక్రమాలు నిర్వహించారు.