హైదరాబాద్ను యూటీ చెయొద్దు : అసదుద్దీన్
న్యూఢిల్లీ : హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయొద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనీ, ప్రధాని మన్మోహన్సింగ్ను కోరానని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఇవాళ ఆయన సోనియాను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్పై కేంద్ర మంత్రుల బృందానికి ఇచ్చిన లేఖనే సోనియాకు మరోసారి ఇచ్చానని ఆయన తెలిపారు.