న్యూఢిల్లీలో ఆప్ఘాన్‌ చిన్నారిపై అత్యాచారం !

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. అప్ఘానిస్థాన్‌ నుంచి వలస వచ్చి ఢిల్లీలోని అంబేద్కర్‌ నగర్‌లో స్థిరపడిన కుటుంబానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. దాంతో ఆ చిన్నారి తల్లి పోలీసులకు ఆశ్రయించింది. నిన్న సాయంత్రం తన కుమార్తెను నిద్రపుచ్చి అనంతరం పనిమీద బయటకు వెళ్లి అరగంటలో ఇంటికి తిరిగి వచ్చానని ,అప్పటికే తన కుమార్తె శరీర భాగాల నుంచి రక్తస్రావం అవుతూ ఏడుస్తూ కనిపించిందని ఆమె పోలీసులకు చేసిన పిర్యాదులో పేర్కొంది. దాంతో పోలీసుసులు ఆ చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స కోసం సర్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో చిన్నారిని సర్దార్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. కాగా చిన్నారిపై అత్యాచారం జరిగిందా లేక అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది వైద్య పరీక్షల ద్వారా వెల్లడి కావలసి ఉందని పోలీసులు వెల్లడించారు. వైద్య నివేదిక అందితే కానీ,,, అసలు విషయం వెలుగులోకి వస్తుందని పోలీసులు శుక్రవారం వెల్లడించారు.