కనువిందు చేస్తున్న పుష్ప ప్రదర్శన

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను తితిదే ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు ఈ రోజు ప్రారంభించారు. అమ్మవారి ఉద్యానవనంలో భక్తులను ఆకట్టుకునేలా తితిదే ఉద్యానవన విభాగం ప్రత్యేకంగా పుష్పాలను అలంకరించింది. దేవతా మూర్తుల ప్రతిమలు, ఏనుగు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. తిరుమల నుంచి తీసుకువచ్చిన రకరకాల పుష్పాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. తొమ్మిది రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది.