డార్జిలింగ్‌లో ప్రారంభమైన 72 గంటల బంద్‌

డార్జిలింగ్‌(పశ్చిమబెంగాల్‌): ప్రత్యేక గుర్ఖాండ్‌ రాష్ట్రం కోసం గుర్ఖాజనముక్తి మోర్చా (జీజేఎం) పోరుబాట చేపట్టింది. డార్జిలింగ్‌ కొండ ప్రాంతాల్లో జీజేఎం పిలుపునిచ్చిన 72 గంటల బంద్‌ ఈ ఉదయం ప్రారంభమైంది. గుర్ఖాాలాండ్‌ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో భాగంగా భవిష్యత్‌లో మరిన్ని బంద్‌లు, ఆందోళనలు చేపడతామని పార్టీ నేతలు తెలిపారు.