ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. నిర్మల్ భవన్ వద్ద ఉన్న పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ హనుమాన్ రోడ్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.