టోల్ బూత్పై దాడికేసులో మంత్రి కుమారుడు బెయిల్పై విడుదల
ముంబయి: మహారాష్ట్రలో మంత్రి నారాయణ్రాణె కుమారుడు నితీశ్, మరో ముగ్గురు మంగవారం రాత్రి బెయిల్పై విడుదలయ్యారు. స్నేహితులతో కలిసి టోల్ బూత్పై దాడి చేసి సిబ్బందిపై దౌర్జన్యం చేసిన కేసులో నితీశ్ని సోలీనులు మంగళవారం సాయంత్రమే అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టైన మరో ఐదుగురిని ఈ రోజు రిమాండుకు తరలించారు. గోవా- మహారాష్ట్ర సరిహద్దులో పెర్నెం గ్రామం వద్ద వెళ్తూ నితీశ్ బృందం టోల్ ట్యాక్స్ కట్టడానికి నిరాకరించడమే కాక సిబ్బందిపై దాడికి దిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.