లంచం తీసుకుంటూ పట్టుబడిన వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌

విశాఖపట్నం: జీవీఎంసీ ప్రకటనల విభాగానికి చెందిన వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ కనకరాజు రూ. 4వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మల్కాపురంలో వైద్యశిబిరం ఏర్పాటుకు ప్రచార నిమిత్తం ఆయన బుధవారం మధ్యాహ్నం లంచం తీసుకుంటుండగా డీఎస్పీ నర్సింహారావు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారుల బృందం దాడి చేసి పట్టుకుంది.