లోక్‌ సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ: రెండో రోజు సభ ప్రారంభమైన వెంటనే దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలాకు పార్లమెంట్‌ ఘనంగా నివాళులర్పించింది. మండేలా మృతి పట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపి ఆయన కృషిని కొనియాడారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ మీరాకుమార్‌ ప్రకటించారు.