వాద్రా ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఖేమ్కాపై ఛార్జిషీటు

ఛండీఘర్‌: ఐఏఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కాపై హర్యానా ప్రభుత్వం ఛార్జిషీటు దాఖలు చేసింది. సోనియా గాంధీ అల్లుడు, వ్యాపార వేత్త అయిన రాబర్ట్‌ వాద్రా, రియల్‌ ఎస్టేట్‌ సంస్థ డీఎల్‌ఎఫ్‌ల ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు ఆయన మీద ఈ ఛార్జిషీటు దాఖలు చేశారు. వీరికి సంబంధించిన భూమి డీల్‌ను ‘చట్ట వ్యతిరుకంగా’ రద్దు చేసినందుకు హర్యానాలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖేమ్కాపై ఛార్జిషీటు దాఖలు చేసి, 15 రోజులలోపు ఆయన దానికి సమాధానం ఇవ్వాలని సూచించింది.