అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం

ఢిల్లీ: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 4.9గా నమోదైనట్లు సమాచారం. పోర్ట్‌ బ్లెయిర్‌కు 229 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.