విజేతలకు ఫోనులో అభినందనలు తెలిపిన ప్రధాని
ఢిల్లీ: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి యోగించిన భాజపా నేతలకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోనులో అభినందనలు తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్లకు, రాజస్థాన్కి కాబోయే ముఖ్యమంత్రి వసుంధర రాజేలకు ఆయన స్వయంగా ఫోనులో అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ వారికి మంచి జరగాలని ప్రధాని ఆకాంక్షించారు.