వెల్‌లోకి దూసుకెళ్ళిన సీమాంధ్ర ఎంపీలు

ఢిల్లీ: వాయిదా అనంతరం పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఫ్లకార్డులతో స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్ళి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.