లోక్ సభ రేపటికి వాయిదా
ఢిల్లీ: గందర గోళం మధ్య లోక్ సభ రేపటికి వాయిదా పడింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీల సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది. ఎంపీలు వెల్లోకి దూసుకెళ్ళి సభాకార్యక్రమాలకు అడ్డు తగలడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. విపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదాపడింది.