సొంత పార్టీ ఎంపీలు అవిశ్వాసం పెట్టడం బాధాకరం: దిగ్విజయ్
ఢిల్లీ: సొంత పార్టీ ఎంపీలు అవిశ్వాసం పెట్టడం బాధాకరమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. సీమాంధ్ర ఎంపీలతో మాట్లాడానని, వారి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణపై సీడబ్ల్యూసీదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్నారని తాము అనుకోవడం లేదన్నారు. జేసీ దివాకర్ రెడ్డి అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్నారని తాము అనుకోవడం లేదన్నారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ… జేసీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అని, ఏ సందర్భంలో అలా మాట్లాడారో పరిశీలలించాల్సి ఉందన్నారు.