అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం: జగన్
ఢిల్లీ: సీమాంధ్ర ఎంపీలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తామని వైకాపా అధ్యక్షుడు జగన్ స్పష్టం చేశారు. పార్లమెంట్ వద్ద జగన్ మీడియాతో మాట్లాడుతూ .. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయంపై దేశానికి, ప్రపంచానికి తెలిపేలా చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారంటే రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విషయం అర్ధమవుతోందన్నారు.