రెండు మూడ్రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది: సీఎం రమేశ్‌

ఢిల్లీ: తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి వంద మందికి పైగా ఎంపీల మద్దతు ఉందని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ తెలిపారు. పార్లమెంట్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ..రెండు మూడ్రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుందన్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్‌ పార్టీకి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.