కేంద్రమంత్రి మృతిపట్ల ప్రధాని, సోనియాల సంతాపం

ఢిల్లీ : కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శీశ్‌రాం ఓలా మృతి పట్ల ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సంతాపం ప్రకటించారు. వారు శీశ్‌రాం మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.