లోక్పాల్ ఆమోదం పొందేలా అందరూ ప్రయత్నించాలి: అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ : రాజ్యసభలో లోక్పాల్లో బిల్లుపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భాజపా నేత అరుణ్జైట్లీ మాట్లాడుతూ కీలకమైన లోక్పాల్ బిల్లు ఆమోదం పొందేలా అందరూ ప్రయత్నించాలని కోరారు. బలమైన లోక్పాల్ కోసం భవిష్యత్తులో మరిన్ని సవరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. బిల్లు అమలైతే ఏడాదిలోగా అన్ని రాష్ట్రాల్లో లోకాయుక్త ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అన్నారు. సెలెక్ట్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్పీ సభ్యుల వాకౌట్…
చర్చ కొనసాగుతుండగానే లోక్పాల్ బిల్లును వ్యతిరేకిస్తూ సమాజ్ వాదీ పార్టీకి చెందిన సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.