తీర్మానానికి మద్దతు లభించినా సభ వాయిదా వేశారు: మోదుగుల

న్యూఢిల్లీ : లోక్‌ సభలో యూపీఏ ప్రభుత్వం తెదేపా ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి ఇచ్చిన నోటీసు పై స్పీకర్‌ సభ అభిప్రాయం కోరారు. అవిశ్వాస తీర్మానానికి బీజేడీ(14), శివసేన(11), అకాళీదళ్‌(4), ఏఐఏడీఎంకే(1),ఏజీపీ(1) సభ్యులు మద్దతు పలికారు. అయితే తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతు లభించినా స్పీకర్‌ సభను వాయిదా వేశారని ఎంపీ మోదుగుల ఆరోపించారు.