లోక్‌పాల్‌ బిల్లును వ్యతిరేకిస్తూ ఎస్పీ సభ్యుల వాకౌట్‌

ఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లుపై లోక్‌ సభలో చర్చ కొనసాగుతోంది. లోక్‌పాల్‌ బిల్లును వ్యతిరేకిస్తూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ మాట్లాడుతూ…. లోక్‌పాల్‌ పై కాంగ్రెస్‌, భాజపా తిందరపడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం తెస్తున్న లోక్‌ పాల్‌ బిల్లు ప్రమాదకరంగా ఉందన్నారు. జేడీయూ అధినేత శరద్‌యాదవ్‌ మాట్లాడుతూ… ప్రధాని పార్లమెంట్‌ కు జవాబుదారీగా ఉండాలి, ప్రధానిని లోక్‌పాల్‌ పరిధిలోకి తేవడం మంచిది కాదని పేర్కొన్నారు.