రెండు రోజులు ముందుగానే లోక్సభ నిరవధిక వాయిదా
ఢిల్లీ : లోక్పాల్ బిల్లు పార్లముంటు ఆమోదం తెలిపిన అనంతరం లోక్సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. రెండు రోజుల ముందుగానే లోక్సభను స్పీకర్ నిరవధిక వాయిదా వేశారు. సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస తీర్మాన నోటీసుల కారణంగా సమావేశాలను కేంద్రం ముందుగానే ముగించినట్లు భావిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆ పార్టీ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే అవిశ్వాస నోటీసులను పక్కన పెట్టారని వారు కోరారు.