అన్నాహజారేకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న విద్యార్థులు

రాలెగావ్‌ సిద్ధి: లోక్‌ పాల్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలపడంతో ప్రముఖ సామాజిక ఉద్యమ కారుడు అన్నా హజారే దీక్షను విరమించారు. లోక్‌పాల్‌ బిల్లును ఆమోదించాలని కోరుతూ మహారాష్ట్రలోని రాలెగావ్‌ సిద్ధిలో తొమ్మిది రోజులుగా హజారే దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. లోక్‌పాల్‌ బిల్లుకు ఆమోదం లభించడంతో రాలెగావ్‌ సిద్ధిలో పండుగ వాతావరణం నెలకొంది.