అశోక్‌ చవాన్‌ విచారణ అవసరం లేదన్న గవర్నర్‌ : ఆదర్శ్‌ కుంభకోణం

ముంబయి: ఆదర్శ్‌ కుంభకోణానికి సంబంధించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌కు వూరట లభించింది. చవాన్‌ను విచారించాలన్న పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌ శంకర్‌నారాయణన్‌ తోసిపుచ్చారు. నేరపూరిత కుట్ర,మోసం ఆరోపణలపై ఆయనను విచారించాలని దాఖలైన పిటిషన్‌పై సీబీఐ సెక్షన్‌ 197 కింద గవర్నర్‌ అనుమతి కోరింది. గవర్నర్‌ దీనిని తోసిపుచ్చడంతో ఆదర్శ్‌ సొసైటీ కుంభకోణంలో ఇప్పుడిక అశోక్‌ చవాన్‌ను విచారించే అవకాశం లేదు.