అభ్యంతరాలుంటే చర్చ సమయంలో చెప్పండి : పొన్నం

ఢిల్లీ: తెలంగాణ బిల్లుపై సీమాంధ్ర నేతలకు అభ్యంతరాలు ఉంటే చర్చ సమయంలో లేవనెత్తాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సూచించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీమాంధ్ర నేతలు చర్చను వ్యతిరేకించడం మంచి పరిణామం కాదన్నారు. ముసాయిదా బిల్లుపై వెంటనే అభిప్రాయాలు చెప్పి రాష్ట్రపతికి పంపాలని విఙ్ఞప్తి చేశారు.