అత్యాచారం ఆరోపణలతో ఎన్జీవో డైరెక్టర్ ఆత్మహత్య
ఢిల్లీ: ఢిల్లీకి చెందిన ప్రముఖ స్వఛ్చంద సంస్థ డైరెక్టర్ ఖుర్షిద్ అన్వర్ అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. వసంత్కుంజ్లోని తన నివాస భవనం మూడో అంతస్థు నుంచి ఆయన కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. జేఎన్యూలో ప్రొఫెసర్ అయిన అన్వర్ భార్య యూనివర్శిటీ క్వార్టర్స్లో నివసిస్తుండగా అన్వర్ ఇక్కడ ఫ్లాట్లో ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. పౌర హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్న ఒక యువతి అన్వర్ మీద వసంత్కుంజ్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు పెట్టింది. దాంతో కలత చెందిన అన్వర్ బుధవారం ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.