ప్రభుత్వ ఏర్పాటుపై రేపు నిర్ణయం : కేజ్రీవాల్‌

ఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి తొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు పై రేపు ఉదయం నిర్ణయిస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ సమన్వయ కర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఏఏపీకి మద్దతిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా? వద్దా? అనే అంశంపై ఏఏపీ ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ తీసుకునే నిర్ణయంపై ఢిల్లీలో ఉత్కంఠ నెలకొంది.